అమావాస్య-మంగళవారం ఈ రోజు ఇలా పూజిస్తే..


నెలలో ప్రతి అమావాస్య రోజున హనుమంతునిని ప్రార్థిస్తే.. సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయుడిని సింధూరంతో అర్చించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. ముఖ్యంగా హనుమంతుని జయంతిని చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు వైభవంగా జరుపుకుంటారు. శ్రీరామనవమితో పాటు కొందరు హనుమంత జయంతిని జరుపుకుంటారు.

ఈ పండుగను జరుపుకోలేని వారు ప్రతి మాసంలో వచ్చే అమావాస్య రోజున నిష్టతో ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించుకోవడం ద్వారా అనుకున్న కార్యాలను దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం.

అందుచేత అమావాస్య సాయంత్రం పూట మహిళలు, పురుషులు ఆంజనేయ స్వామికి నేతితో దీపమెలిగించి.. హనుమంతుడి ఆలయాన్ని 18 సార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా మనోధైర్యం, సకలసంపదలు, ఉన్నత పదవులు లభిస్తాయని పండితులు అంటున్నారు.

 “అసాధ్య సాధక స్వామిన్
 రామదూత కృపా సింథో
 మత్‌కార్యమ్ సాధయ ప్రభో”

 అనే మంత్రాన్ని 9 సార్లు పఠించి.. కర్పూర హారతులు సమర్పించుకున్న వారికి ఈతిబాధలు, గ్రహదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

ఇంకా ఈ  అమావాస్య రోజు ఏం చేయాలి ? ఎలాంటి పూజలు నిర్వహించాలి ? తెలుసుకుందాం..
శాస్త్రాల ప్రకారం అమావాస్య  రోజు శనిదేవుడిని పూజించడం వల్ల.. చాలా ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. అన్ని పాపాలు తొలగిపోవడమే కాకుండా.. ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు కలుగుతుంది.

PAGES : 1   2   3   4   5   6   7